సుప్రీంలో జగన్కు చుక్కెదురు, బాబుకు సిబిఐ క్లీన్చిట్

మరోవైపు జగన్ ఆస్తుల కేసులో సిబిఐ విచారణ నిలిపి వేయాలని జగతి పబ్లికేషన్స్, సండూరు పవర్ వేసిన పిటిషన్లు సోమవారం కోర్టు ముందుకు వచ్చాయి. ఈ రెండు పిటిషన్లను కోర్టు కొట్టి వేసింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో తాము జోక్యం చేసుకోమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. మధ్యలో ఆపివేయడం సాధ్యం కాదని చెప్పింది. ఎలాంటి అక్రమాలు లేకుంటే విచారణకు సహకరించాలని పిటిషన్ దారులకు సూచిస్తూ ఆ పిటిషన్లను కొట్టి వేసింది.
మరోవైపు ఎమ్మార్ కేసులో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాత్రను విచారించాలని ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు బీంరెడ్డి ఎల్లారెడ్డి వేసిన పిటిషన్ను కోర్టు తోసి పుచ్చింది. బాబు హయాంలో ఎమ్మార్లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని సిబిఐ ప్రతిపక్ష నేతకు క్లీన్ చిట్ ఇచ్చింది. తాము 2000 సంవత్సరం నుండి విచారణ చేస్తున్నామని తెలిపారు. సిబిఐ వాదనతో సుప్రీం సంతృప్తి చెందింది. సుప్రీం భీంరెడ్డి పిటిషన్ను తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications