కలిసి ప్రచారం చేస్తున్న సోనియా, ప్రియాంక గాంధీ

Sonia Gandhi-Priyanka Gandhi
లక్నో: ఏఐసిసి అధ్యక్షురాలు, యుపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఆమె కూతురు ప్రియాంక గాంధీ సాధారణంగా బయట ఎక్కడ కూడా ఒకే దగ్గర కనిపించరు. కానీ మంగళవారం వారిద్దరూ ఒకేచోట కనిపించారు. ఉత్తర ప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరూ ప్రచారానికి వచ్చారు. తన నియోజకవర్గం రాయ్‌బరేలీలో సోనియా గాంధీ ప్రచారం నిర్వహించారు. ఆమెతో పాటు ప్రియాంక కూడా పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తల్లీ కూతుళ్లు ఒకే దగ్గర కనిపించడం ఇదే మొదటిసారి. సోనియా నియోజకవర్గంలో ఈ నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సోనియా గాంధీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్రం యుపికి లక్ష కోట్లను విడుదల చేసిందని కానీ మాయావతి ప్రభుత్వం మాత్రం దానిని సక్రమంగా ఖర్చు చేయలేదని ఆరోపించారు. యుపి అధ్వాన్న స్థితిలో ఉందన్నారు.

కాగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, మరో నేత రాజ్‌నాథ్ సింగ్ ప్రచారంలో పాల్గొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత తనయుడు అఖిలేష్ యాదవ్ కూడా పలు ర్యాలీల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఫరూఖాబాద్, హార్డోలి తదితర నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ బిజీగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+