మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ కృష్ణపై చీటింగ్ కేసు

గంటా మురళీ కృష్ణ సోదరుడి కొడుకు 2008లో అస్వస్థతకు గురై పంజాగుట్ట నిమ్స్లో చికిత్స పొందాడు. రూ.72 వేలు బిల్లు కాగా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న మురళీ కృష్ణ తన సోదరుడి కుమారుడిని తన కుమారుడిగా రికార్డుల్లో పేర్కొని ఆ బిల్లును సచివాలయం నుంచి చెల్లించారు. వాస్తవానికి గంటా మురళికి ముగ్గురూ కుమార్తెలే. తన సోదరుడి కుమారుడు అయిన గంటా హనుమంతరావును తన కుమారుడిగా చూపించి నిమ్స్లో వైద్యం చేయించారు. మురళి 2004-09 సంవత్సరాల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యేగా ఉన్నారు.












Click it and Unblock the Notifications