సాక్షి టిన్యూస్‌పై మండిపడ్డ ఎర్రబెల్లి, గవర్నర్ రావణుడు

Errabelli Dayakar Rao
హైదరాబాద్: టి న్యూస్, సాక్షి ఛానల్స్‌పై తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం మండిపడ్డారు. సభ అరగంట వాయిదా పడిన అనంతరం ఎర్రబెల్లి దయాకర రావు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని ఆయన ఆరోపించారు. తనకు అన్ని ప్రాంతాలు సమానమని చెప్పిన గవర్నర్ తెలంగాణలో కేంద్ర పారామిలిటరీ దళాలను వెనక్కి పంపించాలన్నారు. సమానమన్న అయన వ్యాఖ్యలు అసత్యమని ఆరోపించారు. గవర్నర్ తెలంగాణను అడ్డుకునేందుకు వచ్చిన రావణుడు అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికననుసరించి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నాలు గవర్నర్ చేస్తున్నారన్నారు. విద్యార్థులపై కేసులు ఎత్తి వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సకల జనుల సమ్మె సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుకుంటున్నారని, వెంటనే తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. మద్యం సిండికేట్ వ్యవహారంతో సంబంధం ఉన్న మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ కోసం పట్టుబడుతూ సభలో బిజెపి, టిఆర్ఎస్ సభ్యులు పోడియంను చుట్టుముట్టగా మీరెందుకు స్పందించలేదని టి ఛానెల్ ప్రతినిధి ప్రశ్నించగా ఆయన మండిపడ్డారు. మేం స్పందించినా టి న్యూస్, సాక్షి ఛానల్స్‌కు, నమస్తే తెలంగాణ పత్రికకు కనిపించదన్నారు. ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయని వాటితో పాటు తెలంగాణపై స్పందిస్తామన్నారు. ఇక్కడ అడిగితే తెలంగాణ వచ్చేది కాదన్నారు. మీకు అవగాహన లేకపోతే తెలుసుకోవాలన్నారు. తెలుగుదేశం మహానాడులో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+