హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు పార్టీ విలీనానికి ఒకె: సిఎల్పీకి జగన్ వర్గ ఎమ్మెల్సీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ విలీనం తీర్మానాన్ని కాంగ్రెసు శాసనసభా పక్షం (సిఎల్పీ) సమావేశం గురువారం సాయంత్రం ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమయ్యే ప్రక్రియ పూర్తయినట్లే. ప్రజారాజ్యం శాసనసభలో కూడా కాంగ్రెసులో విలీమయ్యే ప్రక్రియ పూర్తవుతుంది. విలీనానికి సంబంధించిన తీర్మానాన్ని ఎమ్మెల్సీ జగదీశ్వర రెడ్డి సమావేశంలో ప్రతిపాదించారు. ఆ తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. తీర్మానం ఆమోద ప్రతిని సిఎల్పీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు అందిస్తారు. దీంతో విలీనాన్ని స్పీకర్ అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత చిరంజీవిని కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) ఉప నేతగా ఎన్నుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.

కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి సిఎల్పీ సమావేశానికి వచ్చారు. డైరీలో ఆమె పేరు లేకపోయినా వచ్చి సంతకం చేశారు. గత కొద్ది కాలంగా పుల్లా పద్మావతి జగన్‌కు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. వరంగల్ జిల్లాలో శాసనసభ్యురాలు కొండా సురేఖ దంపతుల పట్ల ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కొండా దంపతులతో ఉన్న విభేదాల వల్లనే ఆమె జగన్‌కు దూరమైనట్లు చెబుతున్నారు. కొండా దంపతుల వ్యవహారంపై చెప్పినా కూడా జగన్ పట్టించుకోలేదని అంటున్నారు. దీంతో తిరిగి కాంగ్రెసులోకి వచ్చేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డైరీలో సంతకం చేసి పుల్లా పద్మావతి చకచకా వెళ్లిపోయారు. కాంగ్రెసులోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె తన చర్య ద్వారా సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.

English summary
CLP unanimously passed the resolution of Prajarajyam merger in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X