బొత్స సత్తిబాబును టార్గెట్ చేసిన కాంగ్రెసు ఎమ్మెల్యేలు

బొత్సకు జోడు పదవులు ఉండటాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. పదవుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే మాట వాస్తవమేనని అన్నారు. ఏ అధికారాల్లేని ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణకు కట్టబెట్టారన్నారు. కీలక పదవులు అన్నీ ఆంధ్రా వారికే దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రివర్గ ప్రక్షాళణ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు అవినీతిరహిత పాలన కోరుకుంటున్నారన్నారు. భవిష్యత్తులో ఎసిబి తరహా విజిలెన్స్ దాడులు ఉంటాయన్నారు. తమ జిల్లా డిసిసి అధ్యక్షుడి పదవిని బిసిలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెసు పార్టీ నేతలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి జోడు పదవుల అంశంపై లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సీమాంధ్రకు చెందిన వారు జోడు పదవులు అనుభవిస్తున్నారని, పదవుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వారు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications