విజయమ్మకు షాక్: బాబు ఆస్తులపై పిటిషన్ డిస్మిస్
కాగా వైయస్ విజయమ్మ అక్టోబర్ 17న బాబు ఆస్తులపై హైకోర్టులో కేసు వేశారు. 2,424 పేజీల పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబుతో సహా మరో పదమూడు మంది పైన విచారణ జరపాలని ఆమె అందులో కోరారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడు తన హయాంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆమె అందులో పేర్కొన్నారు. ఆమె పిటిషన్ పరిగణలోకి తీసుకున్న కోర్టు సిబిఐ, ఈడి, సెబికి విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తమ వాదన వినకుండానే, కనీసం నోటీసులు జారీ చేయకుండానే విచారణ జరపడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ రావు, సుజనా చౌదరి, సిఎం రమేష్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఈ విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం వారికి సూచించింది. దీంతో వారు తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు సహా పలువురు విచారణపై వెకేట్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా నాట్ బిఫోర్ కారణంగా ఈ కేసు రెండు బెంచీలు మారింది. విచారణ ముగిశాక డిసెంబర్ 14న కోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచడంతో పాటు విచారణపై స్టే విధించింది. గురువారం తుది తీర్పుకు వచ్చింది.