ఒకే కోర్టు రెండు తీర్పులా?: హైకోర్టు తీర్పుపై జగన్ పార్టీ
చంద్రబాబు నాట్ బిఫోర్ అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మరో నేత కెకె మహేందర్ రెడ్డి అన్నారు. బాబు న్యాయవ్యవస్థను కించపరుస్తున్నారని ఆరోపించారు. నాట్ బిఫోర్తో న్యాయస్థానంలోనూ రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఒకే హైకోర్టులో రెండు తీర్పులు ఎలా వస్తాయని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పిటిషన్ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. చంద్రబాబు తప్పు చేయనప్పుడు స్టే ఎందుకు తెచ్చుకున్నారని మరో నేత శోభా నాగి రెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు తీర్పుతో చంద్రబాబు ఏ తప్పు చేయలేదని టిడిపి నేతలు ప్రచారం చేయడం సరికాదన్నారు.
Comments
sobha nagi reddy vasireddy padma ysr congress ys vijayamma chandrababu naidu hyderabad శోభా నాగి రెడ్డి వాసిరెడ్డి పద్మ వైయస్సార్ కాంగ్రెసు వైయస్ విజయమ్మ చంద్రబాబు నాయుడు హైదరాబాద్
English summary
YSR Congress leaders said they will go to Supreme Court on High Court justice about Chandrababu Naidu assets case.
Story first published: Thursday, February 16, 2012, 11:32 [IST]