కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లింట విషాదం: పెళ్లి కూతురు తండ్రి మరణం

By Pratap
|
Google Oneindia TeluguNews

Karimnagar District
కరీంనగర్/ విజయవాడ: కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండలం సుందరగిరిలోని ఓ పెళ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కూతురు పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వెళ్తూ సైకిల్ పై నుంచి కింద పడి తండ్రి మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కరీంనగర్ జిల్లాలోనే మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో జీటీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఢీకొని అక్కాతమ్ముడు మృతి చెందారు. వికాలాంగుడైన తమ్ముడును ట్రాక్ దాటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

కృష్ణఆ జిల్లాలోని కైకలూరులో డిగ్రీ విద్యార్థి సురేష్ శనివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ వైఫల్యమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

English summary
At the time daughter's marriage a person was dead in an accident in Karimnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X