కమిషనర్ల ఫైల్ తిరస్కరణ: ప్రభుత్వానికి గవర్నర్ ఝలక్

కమిషనర్ల నియామకంలో అవకతవకలు ఉన్నాయని, రాజకీయ నాయకులకు అందులో చోటు కల్పించారని ఆరోపణలు వచ్చాయి. ఇది తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో అధిష్టానం నుండి అందిన సూచనల మేరకే గవర్నర్ ఈ ఫైలును తిరస్కరించి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మాట్లాడుతూ.. కమిషనర్లుగా నియమించిన ఫైలును పరిశీలిస్తున్నామని, వివరణ కోరామని చెప్పారు. ఆ తర్వాత గవర్నర్ కూడా తన వద్దకు పైల్ ఇంకా రాలేదని, వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకే సచివాలయానికి ఫైల్ను తిప్పి పంపారని అంటున్నారు. కాగా ఇంతియాజ్ అహ్మద్, విజయ నిర్మల, కోనేరు తాంతియా కుమారి పేర్లను తిరస్కరించినట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications