హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌కు ఊరట: పోటీపై వెనక్కి తగ్గిన బిజెపి

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు ఊరట లభించింది. మహబూబ్‌నగర్‌లో మినహా తెలంగాణలోని మిగతా స్థానాల్లో పోటీకి దిగాలనే యోచనను బిజెపి విరమించుకుంది. మంగళవారం సాయంత్రం జరిగిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌లో మాత్రం పోటీకి దిగాలని ఆలోచిస్తోంది. ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి ఆకస్మిక మృతి వల్ల మహబూబ్‌నగర్ సీటుకు ఉప ఎన్నిక జరుగతోంది. మిగతా చోట్ల తెలంగాణ కోసం తమ తమ పార్టీలకు రాజీనామాలు చేసిన అభ్యర్థుల్లో నలుగురు తెరాస తరఫున, నాగం జనార్దన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగబోతున్నారు. మహబూబ్‌నగర్‌కు తమ అభ్యర్థిగా ఇబ్రహీం పేరును తెరాస ప్రకటించింది.

బిజెపి మహబూబ్ నగర్, కోవూరులతో పాటు స్టేషన్ ఘనపూర్, కామారెడ్డి స్థానాల నుంచి కూడా పోటీకి దిగాలని యోచించింది. నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆయనకు తెరాస కూడా మద్దతు ఇవ్వబోతోంది. అయితే, తెరాస విజ్ఞప్తులతో, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ దౌత్యంతో బిజెపి నాయకత్వం దిగి వచ్చినట్లు చెబుతున్నారు.

రాజీనామాలు చేసిన స్థానాల్లో ఆయా అభ్యర్థులే పోటీ చేస్తారని కోదండరామ్ మంగళవారం చెప్పారు. దానిపై ఎటువంటి సందేహాలు అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాజకీయ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశానంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మహబూబ్‌నగర్ స్థానం విషయంలో మాత్రం బిజెపి, తెరాస తేల్చుకుంటాయని ఆయన అన్నారు. ప్రస్తుత స్థితిలో మహబూబ్ నగర్ సీటు వివాదం కూడా కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.

English summary
TRS president K Chandrasekhar Rao got relief, as BJP has decided not to contest for Kamareddy and station Ghanapur seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X