సాయిరెడ్డి రిమాండ్ పొడగింపు: సిబిఐ ముందు ఐఏఎస్

కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఐఎఎస్ అధికారి పార్థసారథి మంగళవారం సిబిఐ ముందు హాజరయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జగన్కు చెందిన సాక్షి దినపత్రికకు ఇచ్చిన వాణిజ్య ప్రకటనలపై సిబిఐ ఆరా తీస్తోంది. ఈ విషయాలను రాబట్టడానికే పార్థసారథిని సిబిఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పార్థసారథి సమాచార కమిషనర్గా పనిచేశారు. ఇదిలావుంటే, గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిపై చార్జిషీట్ దాఖలుకు సిబిఐ మరింత గడువు కోరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications