విజయలక్ష్మి మనస్తాపం: ఇండిపెండెంట్గా బరిలోకి

మహబూబ్నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమె చెప్పారు. తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న ఆరు స్థానాల్లో మూడు స్థానాలు మహబూబ్నగర్ జిల్లాలోనే ఉన్నాయి. కొల్లాపూర్ సీటును విష్ణువర్ధన్ రెడ్డికి, నాగర్ కర్నూలు సీటును దామోదర్ రెడ్డికి కేటాయించారు. మహబూబ్నగర్ సీటు విజయలక్ష్మికి ఇస్తే ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే అవుతారు. దీంతో మహబూబ్నగర్ నుంచి బిసి అభ్యర్థిని రంగంలోకి దించాలని కాంగ్రెసు నాయకత్వం భావించినట్లు తెలుస్తోంది. దీంతో విజయలక్ష్మికి టికెట్ దక్కలేదు.












Click it and Unblock the Notifications