సిఎంకు నవ్వు వస్తోంది, పదవుల కోసం పైరవీలు: బాబు

మిగిలిన రాష్ట్రాల్లో రైతుకు మద్దతు ధర ఉంటే మన రాష్ట్రంలోనే లేదన్నారు. కాంగ్రెసు మాటలు కోటలు దాటేలా ఉన్నా చేతలు గడప దాటడం లేదన్నారు. రూ.70 కోట్లు పెట్టి ఎకరా భూమికి నీరు అందించలేదన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు. ఢిల్లీలో పదవుల కోసం పైరవీలే తప్ప ప్రజా సమస్యలు వీరికి పట్టడం లేదన్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారన్నారు. రాష్ట్రం నుండి 32 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ రైల్వే బడ్జెట్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేలేక పోతున్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు భారీగా ఉన్నాయన్నారు. చివరకి సిఎం పేషీలో కూడా కరెంట్ లేని పరిస్థితి ఉందన్నారు.












Click it and Unblock the Notifications