టిడిపి మూర్ఖపు పార్టీ: తెరాస నేత ఈటెల రాజేందర్
ఉప ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు డిపాజిట్లు గల్లంతవుతాయని, ప్రజా క్షేత్రంలోని తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్తామని ఆయన అన్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు మహబూబ్నగర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పల్లెబాట కార్యక్రమం ఉంటుందని ఆయన చెప్పారు. 29వ తేదీ వరకు ప్రతి గ్రామం తిరుగుతామని ఆయన చెప్పారు. తాము ఏది చేసినా తెలంగాణ సాధన కోసమేనని ఆయన అన్నారు.
ఎన్నికలు జరిగే అన్ని నియోజకవర్గాల్లోని ప్రతి మండలంలో తమ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఆధ్వర్యంలో సభలుంటాయని ఆయన చెప్పారు. మార్చి 5 నుంచి 9వ తేదీ వరకు ఈ సభలు జరుగుతాయని, మార్చి 10వ తేదీన నాగర్ కర్నూలులో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఈ సభలో కెసిఆర్తో పాటు నాయకులంతా పాల్గొంటారని ఆయన చెప్పారు. ఇదే స్థాయిలో మార్చి 11న ఆదిలాబాదులో బహిరంగ సభ ఉంటుందని ఆయన చెప్పారు. మహబూబ్నగర్లో కేసిఆర్ మూడు రోజుల పాటు మకాం వేస్తారని ఆయన చెప్పారు.