భాష నేర్చుకోవాలని సిఎం: ఉరేసేవారని చంద్రబాబు
దానిపై చంద్రబాబు తీవ్రంగా ప్రతిస్పందిస్తూ - దోపిడీ చేసేవారనే మాట అన్ పార్లమెంటరీ కాదని, ఇంత అవినీతి వేరే దేశాల్లో జరిగి ఉంటే ఉరేసేవారని అన్నారు. తమ విమర్శలను భరించలేకపోతే తాము ఏమీ చేయలేమని ఆయన అన్నారు. ఏ విధంగా మాట్లాడాలో చెప్పే అర్హత ఈ ముఖ్యమంత్రికి లేదని ఆయన అన్నారు. 1994లో కాంగ్రెసు కేవలం 24 సీట్లు మాత్రమే గెలుచుకుని ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక పోయిందని, అయినా తాము కాంగ్రెసుకు మాట్లాడే అవకాశం కల్పించామని ఆయన చెప్పారు. మాట్లాడే అర్హత లేదని, మాట్లాడవద్దని తాను ఏనాడూ అనలేదని ఆయన అన్నారు.
చంద్రబాబు మాటలకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిస్పందిస్తూ - అవకాశం కల్పించేది తాము కాదని, స్పీకర్ కల్పిస్తారని, తాము స్పీకర్ను నియంత్రించడం లేదని, చంద్రబాబు తన హయాంలో నియంత్రించారేమో తెలియదని ఆయన అన్నారు.
Comments
kiran kumar reddy chandrababu naidu assembly hyderabad కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు శాసనసభ హైదరాబాద్
English summary
War of words took place between CM Kiran kumar Reddy and opposition leader Chandrababu in assembly.
Story first published: Wednesday, February 22, 2012, 13:35 [IST]