మద్యం ముడుపులపై సభలో మంత్రి కన్నా ప్రకటన

మద్యం సిండికేట్లతో అధికారులు కుమ్మక్కయ్యారని అధారాలు ఉన్నాయన్నారు. మద్యాన్ని ఎమ్మార్పీకి అమ్మడం వల్లే ప్రభుత్వంపై కక్ష కట్టారన్నారు. టిడిపి హయాంలో మద్యం ఆదాయానికి భారీగా గండి పడిందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త రమణతో ఓ పథకం ప్రకారం మంత్రులపై ఆరోపణలు అన్నారు. ఓ క్రిమినల్ చెప్పిన మాటలు నమ్మి టిడిపి సభలో రాద్దాంతం చేయడం తగదన్నారు. రమణది క్రిమినల్ చరిత్ర అన్నారు. ఆయన వాంగ్మూలాన్ని సీరియస్గా తీసుకోవద్దన్నారు. కన్నా మాట్లాడుతుండగా టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అడ్డు తగిలి మంత్రి ప్రకటనలో ఎలాంటి వివరాలు లేవన్నారు. ఎసిబి రిపోర్టును అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు. రిమాండు రిపోర్టులో ఓ మంత్రి పేరు ఉందని డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారని తెలిపారు. ఆ మంత్రి పేరు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. మా వద్ద ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications