Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైయస్ జగన్ రాజ్యసభ ఎన్నికల వ్యూహం రెడీ

YS Jagan
హైదరాబాద్: వైయస్ జగన్ రాజ్యసభ ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేలోగా తన వర్గానికి చెందిన శాసనసభ్యులపై అనర్హత వేటు పడకపోతే రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీకి ప్రస్తుతం విజయమ్మ ఒక్కరే శాసనసభ్యురాలు ఉన్నారు. కాంగ్రెసుకు చెందిన 16 మంది, ప్రజారాజ్యం పార్టీకి చెందిన ఒకరు జగన్ వైపు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మంత్రాలయం శాసనసభ్యుడు బాలనాగిరెడ్డి కూడా వైయస్ జగన్‌కు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతిచ్చి అవకాశం ఉందని అంటున్నారు. ఆ రకంగా జగన్‌కు 19 మంది శానససభ్యులున్నారు. ఈ బలంతో రాజ్యసభ బరిలోకి అభ్యర్ధిని రంగంలోకి దింపే ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు.

తమ పార్టీ తరఫున అభ్యర్థిని దింపి, మరింత మంది కాంగ్రెసు శాసనసభ్యుల మద్దతు కూడగట్టే ఆలోచన ఓ వైపు సాగుతుండగా, మరో పార్టీ అభ్యర్థికి మద్దతిచ్చే విషయం కూడా ఇంకో వైపు సాగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజ్యసభ బరిలో అభ్యర్థిని పెడితే బలపరచాలనే ఆలోచన కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెరాసకు 13 మంది శానససభ్యులున్నారు.

రాజ్యసభ ఎన్నికలకు వచ్చే నెల నోటిఫికేషన్ వెలువడనుంది. జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై ఈ నోటిఫికేషన్ వెలువడే లోగానే అనర్హత వేటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ అది జరగకపోతే నోటిఫికేషన్ వెలువడిన తర్వాత వేటు వేయడానికి వీలు కాదు. మొత్తం, వైయస్ జగన్ పార్టీలో రాజ్యసభ ఎన్నికలపై తీవ్రంగానే ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+