గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలోకి రాజకుమారి కూతురు, అల్లుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Nannapaneni Rajakumari
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కూతురు, అల్లుడు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్ సమక్షంలో రాజకుమారి అల్లుడు ఎల్. లతీఫ్‌రెడ్డి, కూతురు సుధ ఆ పార్టీలో చేరారు. శనివారం సాయంత్రం యాత్ర వినుకొండకు చేరుకున్నప్పుడు వారిద్దరు జగన్ వెంట దర్శనమిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నట్టు జగన్ సమక్షంలోనే ప్రకటించారు.

రాజకుమారి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుండగా, ఆమె కూతురు, అల్లుడు జగన్ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. గతంలో వినుకొండ నియోజకవర్గానికి నన్నపనేని ప్రాతినిధ్యం వహించగా, వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీ తరఫున ఆమె కూతురు ఈ స్థానానికి పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

English summary
TDP leader Nannapaneni Rajakumar's son and daughter have joined into YS Jagan's YSR Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X