జగన్ వర్గ ఎమ్మెల్యేలపై త్వరలో వేటు: సిఎం సంకేతం
పోలవరం టెండర్లపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలపై ఆయన స్పందిస్తూ - త్వరలో 24 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయని, ఆ ఉప ఎన్నికల్లో ఎవరు ఏమిటో తెలుస్తుందని తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రెండు నెలల్లో టెండర్లు పిలుస్తామని ఆయన చెప్పారు. అనవసరంగా తమపై బురద చల్లవద్దని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు.
ఏడు స్థానాలకు మార్చి 18వ తేదీన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రెండో విడత ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి వీలుగా వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై చర్యలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పావులు కదిపే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు లోకసభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డిని స్పీకర్ మీరా కుమార్ ఆమోదించిన నేపథ్యంలో జగన్ వర్గానికి చెందిన శానససభ్యులపై వేటుకు మరింత జాప్యం జరిగే అవకాశాలు లేవని అంటున్నారు.