హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆయన జాగీరా?: లష్కర్‌పై అంజన్‌కు ముఖేష్ కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mukesh Goud
హైదరాబాద్: మంత్రి ముఖేష్ గౌడ్ సికిందరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంపై ఏమాత్రం తగ్గడం లేదు. పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ మంగళవారం చేసిన వ్యాఖ్యలపై ముఖేష్ గౌడ్ బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2014 సాధారణ ఎన్నికల్లో సికిందరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తానన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ముఖేష్ చెప్పారు. అది అంజన్‌దో నాదో జాగీరు కాదని అన్నారు. ప్రజల జాగీరు అన్నారు. సికిందరాబాద్ స్థానం నుండి ఎవరు పోటీ చేయాలనే అంశం నిర్ణయించాల్సింది తాము కాదని తమ పార్టీ అధిష్టానం అని చెప్పారు.

కాగా వచ్చే ఎన్నికల్లో సికిందరాబాద్ ఎంపిగా తాను పోటీ చేస్తానని మంగళవారం ఉదయం ముఖేష్ గౌడ్ చెప్పిన విషయం తెలిసిందే. అంజన్ ముషీరాబాద్ నుండి బరిలోకి దిగుతారని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై అంజన్ సాయంత్రం స్పందించారు. సికింద్రాబాద్ ఏమైనా ముఖేష్ సొంతమా.. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంపై కన్నెస్తే ఖబర్దార్ అంటూ నిప్పులు చెరిగారు. తాను ఎక్కడి నుండి చేయాలో చెప్పడానికి ముఖేష్ ఎవరు అన్నారు. ఆయన ఏమైనా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాదా వాటి ఈజ్ దిస్ నాన్సెన్స్ అని అన్నారు.

అసలు రెండేళ్ల ముందు నుంచే ఎన్నికల గురించి మాట్లాడాల్సిన అవసరమేమొచ్చిందని అన్నారు. 2004లో సికింద్రాబాద్ ఎంపిగా పోటీ చేసేందుకు ఎవరూ సాహసించని సమయంలో తాను ధైర్యంగా బండారు దత్తాత్రేయపై పోటీ చేసి గెలిచానని అన్నారు. రెండోసారి భారీ మెజార్టీతో గెలిచానన్నారు. ప్రజల్లోకి వెళ్లే వారికే గుర్తింపు ఉంటుందే తప్ప, పైరవీలు చేసి బతికేవారికి పరాభవం తప్పదన్నారు.

English summary
Minister Mukesh Goud countered MP Anjan Kumar Yadav statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X