సత్యమేవ జయతే..: బెంగళూర్‌కు గాలి తరలింపు

Gali Janardhan Reddy
హైదరాబాద్: హైదరాబాదులోని చంచల్‌గుడా జైలు నుంచి బయటకు వస్తూ కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సత్యమేవ జయతే అంటూ నినాదాలు చేశారు. కర్ణాటకలోని అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డిని బెంగళూర్ తరలించేందుకు అధికారులు బయటకు తీసుకుని వచ్చారు. ఈ సమయంలో పెద్ద యెత్తున మీడియా అక్కడికి చేరుకుంది. గాలి జనార్దన్ రెడ్డితో మాట్లాడడానికి మీడియా ప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఆ సయమంలో సత్యమేవ జయతే అంటూ గాలి జనార్దన్ రెడ్డి నినాదాలు చేశారు.

గాలి జనార్దన్ రెడ్డి భారీ భద్రత మధ్య వాహనంలో రోడ్డు మార్గం ద్వారా బెంగళూర్ తరలించారు. తనను తరలించే సమయంలో కూడా రోడ్డు మార్గం ద్వారా తీసుకుని వెళ్తే తన ప్రాణాలకు ముప్పు ఉందని, హైలికాప్టర్‌లో గానీ విమానంలో గానీ తీసుకుని వెళ్లాలని ఆయన జైలు అధికారులతో, సిబిఐ అధికారులతో అన్నారు. ఆయన మాటలను అధికారులు పట్టించుకోలేదు.

అంతకు ముందు - తనను హెలికాప్టర్‌లో లేదా విమానంలో బెంగళూర్‌ తరలించాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. గాలి జనార్దన్ రెడ్డిని నిబంధనల మేరకు, చట్టప్రకారం బెంగళూర్ తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రోడ్డు మార్గం ద్వారా గాలి జనార్దన్ రెడ్డిని బెంగళూర్ తరలించారు. గురువారం సాయంత్రం గాలి జనార్దన్ రెడ్డిని వాహనంలో తీసుకుని అధికారులు బెంగళూర్ ప్రయాణమయ్యారు. రేపు శుక్రవారం ఉదయం ఆయనను బెంగళూర్‌ కోర్టులో హాజరు పరుస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+