హెచ్ఆర్ మేనేజర్ హత్య: సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్టు
పాతికేళ్ల హతుడు పాట్నాకు చెందిన పరమానంద్ ఫిబ్రవరి 25వ తేదీన ఇఫ్కో చౌక్ వద్ద సాఫ్ట్వేర్ ముఠా పికప్ చేసుకుంది. లుక్ష్మి ఎంటర్ప్రైజెస్ అనే సెక్యూరిటీ ఏజెన్సీలో పరమానంద హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఢిల్లీలో ప్లాట్ చూడాలని వెళ్లేందుకు ఇఫ్కో చౌక్ వద్ద నించున్నాడు. అతని వద్ద 50 వేల రూపాయలున్నాయి. అతని ముందు హుందాయ్ ఇయోన్ కారు ఆగింది. ఢిల్లీకి తీసుకుని వెళ్తామని కారులో ఉన్నవారు చెప్పారు. నలుగురు వ్యక్తులు అప్పటికే కారులో ఉన్నారు. కారులో కూర్చుని కొంత దూరం ప్రయాణించిన తర్వాత మాత్రమే అతనికి వారిపై అనుమానం వచ్చింది.
ఆ రోజు రాత్రి ఎనిమిదిన్న గంటల ప్రాంతంలో బిలాస్పూర్ వద్ద ముఠా పరమానందను దోచుకుని కిందికి తోసేయడానికి ప్రయత్నించింది. అతడు ప్రతిఘటించాడు. దాంతో దుండగులు అతన్ని కత్తులతో పొడిచి చంపేశారు. హత్య తర్వాత రింగ్ లీడర్ ప్రశాంత్ ఢిల్లీకి పారిపోయాడు. విపరీతంగా మద్యం సేవించి ఎయిమ్స్లో చేరాడు. అయితే, కారులో రక్తంతో తడిసిన కత్తిని పోలీసులు కనిపెట్టి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రశాంత్ నేరాన్ని అంగీకరించాడు.