హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెఏ పాల్‌తో విభేదాల్లేవు, సువార్త ప్రసంగాలే: బ్ర.అనిల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KA Paul and Anil Kumar
హైదరాబాద్: తనకు క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కెఏ పాల్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బావ, క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్ శుక్రవారం స్పష్టం చేశారు. తనకు కెఏ పాల్ తో విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తాను ఏర్పాటు చేసే మత ప్రచార సభల్లో సువార్త ప్రసంగాలే తప్ప ఎప్పుడూ ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయలేదని అన్నారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన గాని ఉద్దేశ్యం గాని లేదని స్పష్టం చేశారు.

కాగా బ్రదర్ అనిల్ కుమార్ సువార్త సభల్లో రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ వర్గాన్ని పూర్తిగా తన బావమరిది జగన్ వైపు మరల్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకు సువార్త సభలను ఆయన వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి. యేసు క్రీస్తు నామం జపించాల్సిన చోట అంతకంటే ఎక్కువంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నామస్మరణం చేస్తున్నారనే వాదనలు వినిపించాయి. ఎక్కడ ఏసుక్రీస్తు సభలు జరిగినా అనిల్ వైయస్సార్ పేరును ప్రస్తావిస్తూ దేవుని వ్యాఖ్యంలో రాజకీయ డైలాగులు చెబుతున్నారనే విమర్శలు వచ్చాయి. ఇటీవల గోదావరి జిల్లాలోని అమలాపురంలో సువార్ సభలో అనిల్ తో పాటు ఆయన భార్య షర్మిళ కూడా పాల్లొన్నారట. అక్కడ అనిల్ మాట్లాడుతూ.. అద్వితీయమైన కుమారుడిని ఇచ్చారంటూ పరోక్షంగా వైయస్సార్, జగన్‌లను ఉద్దేశించి ప్రస్తావించారని వార్తలు వచ్చాయి.

English summary
Brother Anil Kumar said that he has no differences with Praja Shanthi party chief KA Paul.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X