హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌పై మండిపడుతున్న బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడుతున్నారు. శుక్రవారం శానససభ లాబీల్లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన విషయాలే ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. మహబూబ్‌నగర్ శాసనసభా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. తెరాస గెలిచినా ప్రయోజనం ఏమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీ గెలిస్తే జాతీయ స్థాయిలో ప్రభావం ఉంటుందని, కాంగ్రెసుకు కనువిప్పు కలగాలంటే బిజెపి గెలవాల్సిందేనని ఆయన అన్నారు.

ఉప ఎన్నికల్లో మహబూబ్‌నగర్ సీటును తమకు కేటాయించాలని బిజెపి పట్టుబట్టింది. అందుకు కెసిఆర్ నిరాకరించారు. దీంతో బిజెపి నాయకత్వం ఆగ్రహంతో తెరాసతో తెగదెంపులు చేసుకుంది. మహబూబ్‌నగర్ సీటులో తమ పార్టీ అభ్యర్థిగా యెన్నం శ్రీనివాస రెడ్డిని పోటీకి దించింది. తెరాస అభ్యర్థి ఇబ్రహీం కూడా పోటీలో ఉన్నారు. తెరాస అభ్యర్థులకు తాము మద్దతు ఇవ్వబోమని కూడా బిజెపి స్పష్టం చేసింది.

English summary
BJP state president G Kishan Reddy is angry with TRS president K Chandrasekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X