వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బస్సు ప్రయాణంతో అలసిపోయిన గాలి, స్వల్పఅస్వస్థత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి, ఓబుళాపురం మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్ధన్ రెడ్డి బస్సు ప్రయాణంతో అలసి పోయారు. గురువారం సాయంత్రం గాలిని రోడ్డు మార్గంలో ఒక సిఐ, ఇద్దరు ఎస్ఐలు, ఎనిమిది మంది పోలీసుల భారీ బందోబస్తు మధ్య బస్సులో బెంగళూరు తరలించిన విషయం తెలిసిందే. అయితే గాలి జనార్ధన్ రెడ్డి ఆరు వందల కిలోమీటర్ల సుదూర బస్సు ప్రయాణంలో పూర్తిగా అలసిపోయారు. దీంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పోలీసు స్టేషన్‌లోనే వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. చాలా గంటల పాటు ఆయన బస్సులో కూర్చోవడంతో నడుం నొప్పితో బాధపడుతున్నారు. అతనిని సిబిఐ అధికారులు ఎఎంసి కేసులో కోర్టులో హాజరు పర్చారు. గాలిని తమ కస్టడీకి అప్పగించమని సిబిఐ కోరనుంది.

కాగా గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి కేసులో అరెస్టైన తర్వాత తొలిసారి కర్నాటకకు వెళ్లారు. దీంతో అతనిని చూడటానికి భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు. గాలిని ఉంచిన పోలీసు స్టేషన్ ప్రాంగణం అంతా గాలి అభిమానులతో నిండిపోయింది. అతనికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఎప్పుడు బయటకు వస్తాడా ఎప్పుడు చూద్దామా అన్న ఆతృత వారిలో కనిపించింది. భారీగా జనాలు తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా గాలిని కోర్టుకు తరలిస్తున్న సమయంలో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కవరేజ్ చేస్తున్న మీడియాపై న్యాయవాదులు దాడి చేయడంతో ఐదుగురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి.

English summary
Karnataka former minister Gali Janardhan Reddy injured with long tour in bus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X