అవసరమైతే జూ.ఎన్టీఆరొస్తారు, బాలయ్యపైనా: హరికృష్ణ

కాంగ్రెసు పార్టీ అందిన కాడికి దోచుకుంటుందని ఆయన ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సమర్థ పాలన ఉంటుందని తద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెసు పాలన కారణంగా రాష్ట్రం దౌర్భాగ్య స్థితిలో ఉందన్నారు. రైతులను, మహిళలను ఈ ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీయేనన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దుతో తెలంగాణ అభివృద్ధి పథంలో నడిచిందన్నారు. ఎన్టీఆర్ రక్తం పంచుకొని పుట్టిన ప్రతి ఒక్కరూ టిడిపి అభివృద్ధికే కృషి చేస్తారన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని చెప్పారు. కాగా ఎడ్లబండిలో ప్రయాణించి హరికృష్ణ హల్ చల్ చేశారు. హరికృష్ణ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు అందరూ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications