కొత్త పద్ధతుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు: సిఎం
సభను నిత్యం వాయిదా వేయడాన్ని తప్పు పడుతూ తెలుగుదేశం పార్టీ నేతలు స్పీకర్ చాంబర్ వద్ద ఆందోళన నిర్వహించారు. స్పీకర్ నిరంకుశ ధోరణితో సభను ఏకపక్షంగా నిర్వహిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. సకల జనుల సమ్మె సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం మోసం చేసిందని ఎర్రబెల్లి దయాకర రావు ఆరోపించారు. 177 జివోను రద్దు చేయమంటే కోర్టు పరిధిలో ఉందని చెప్పి సిఎం చేతులెత్తేశారన్నారు. ఉద్యోగుల హామీలు ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. సిఎం బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సమ్మె సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. కాగా స్పీకర్ చాంబర్ వద్ద టిడిపి నేతలు ధర్నా చేస్తూ లోనికి వెళ్లే ప్రయత్నాలు చేశారు. సిబ్బంది వారిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న స్పీకర్ వారిని లోనికి పిలిచి మాట్లాడారు. జివోపై ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుదామని సూచించారు.