409 సెక్షన్ నాకు వర్తించదు: విజయ సాయి రెడ్డి వాదన

ఇదిలా వుంటే, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో ఎంజిఎఫ్ సిఇవో శ్రీకాంత్ జోషీ సోమవారం సిబిఐ ఎదుట హాజరయ్యారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఆయనను సిబిఐ అధికారులు సోమవారంనుంచి ఐదు రోజుల పాటు విచారించనున్నారు. ఎమ్మార్ విల్లాల విక్రయాల్లో ఎంజిఎఫ్ సిఇవోగా శ్రీకాంత్ జోషీ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సిబిఐ విచారణ జరుపుతోంది.
ఇతర నిందితులు శ్రవణ్ గుప్తా, ఎమ్మార్ అధికారి విజయ రాఘవలతో కలిసి శ్రీకాంత్ జోషి కుట్ర చేసి ఎపిఐఐసిని మోసం చేశారని సిబిఐ అభియోగాలు మోపింది. అయితే, ఈ అభియోగాలను సవాల్ చేస్తూు శ్రీకాంత్ జోషీ నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారణను కోర్టు ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications