తాగుబోతు కెసిఆర్ ఏం మాట్లాడ్తారో: మోత్కుపల్లి

Mothkupalli Narasimhulu
హైదరాబాద్: తాగిన మత్తులో తాను ఏం మాట్లాడుతాడో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకే తెలియదని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. తెరాస స్థాపించి 11 ఏళ్లు కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ ఆయన వరుసగా మూడో రోజు గురువారం హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ నుంచి అమర వీరుల స్థూపం వరకు పాదయాత్ర చేశారు. తాగుబోతు కెసిఆర్ ఏ క్షణంలో ఏం మాట్లాడుతారో తెలియని మూర్ఖుడని ప్రజలు అనుకుంటున్నారని, కెసిఆర్ మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదని ఆయన అన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని తిట్టి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి, ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి డబ్బులు తెచ్చుకోవడం కెసిఆర్ మానుకోవాలని ఆయన అన్నారు. 11 ఏళ్లుగా కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ చెసిన నిరాహారదీక్ష నాటకమని ఆయన అన్నారు. సకల జనుల సమ్మెను కెసిఆర్ సకల సంపదగా మార్చుకున్నారని ఆయన అన్నారు. పదవుల కోసం, సంపద కోసం పార్టీలు మారే వారికి ఉప ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.

తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని మరో తెలంగాణ ప్రాంత శానససభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలోని ఆరు స్థానాల్లో ప్రచారం చేస్తారని ఆయన చెప్పారు. తెరాస రాజీనామాలతో తెలంగాణ రాదని తేలిపోయిందని ఆయన అన్నారు. తాము తెరాస కార్యకర్తలను గుండాలతో కొట్టిస్తున్నట్లు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+