ఉప పోరు బరిలో: రంగంలో గండ్ర భార్య, పిఆర్పీ వారే

నరసాపురం నుండి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాచర్ల నుండి లక్ష్మా రెడ్డి, ప్రత్తిపాడు నుండి సుధాకర్ బాబు, ఒంగోలు నుండి శ్రీనివాసులు, ఉదయగిరి నుండి విజయ రాంరెడ్డి, రాయచోటి నుండి రాం ప్రసాద్ రెడ్డి, రైల్వే కోడూరు నుండి ఈశ్వరయ్య, రాయదుర్గం నుండి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మిగనూరు నుండి రుద్ర గౌడ్, తిక్కా రెడ్డి, అనంతపురం నుండి వెంకట్రామి రెడ్డి కుటుంబ సభ్యులలో ఒకరు, ఆళ్లగడ్డ నుండి గంగుల ప్రతాప్ రెడ్డి, పరకాల నుండి ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి సతీమణి గండ్ర జ్యోతి పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయా నియోజకవర్గాలలో పట్టున్న కాంగ్రెసు నేతలు పెద్దగా లేకపోవడంతో గత సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన పిఆర్పీ అభ్యర్థులనే రంగంలోకి దింపే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications