తుంగభద్ర తీరాన కెసిఆర్ విగ్రహం: టిజి వెంకటేష్
కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటుకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- తెలంగాణ ఉద్యమం పేరుతో రాజధానిలోని ట్యాంక్బండ్పై ఉన్న సాహితీ, సాంస్కృతిక రంగాల మహనీయులు, స్వాతంత్య్రోద్యమ నాయకుల విగ్రహాలను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేయడం విచార కరమన్నారు. అందుకే ఆ విగ్రహాలను తుంగభద్ర నదీతీరాన నిర్మించే వరద రక్షణ గోడలపై నెలకొల్పుతున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్బాబు, కలెక్టర్ రాంశంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
English summary
Minister TG Venkatesh said that statues, which were demolished on Hyderabad tankbund will be installed at the bank of Tungabhadra.
Story first published: Friday, March 9, 2012, 9:19 [IST]