చిరంజీవికి కౌంటర్: దాసరి కోసం బొత్స సత్తిబాబు ప్లాన్
మద్యం సిండికేట్ల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనపై దాడి చేస్తుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రోత్సహించినట్లుగా వ్యవహరించే అభిప్రాయం కూడా బొత్సకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషంయలో ముఖ్యమంత్రి తీరుపై అధిష్టానం వద్ద తన నిరసనను వ్యక్తం చేసినట్లు సమాచారం. లిక్కర్ వ్యవహారం గురించి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ నేరుగా బొత్సతో ప్రస్తావించినట్లు సమాచారం. మీ వల్ల పార్టీకి ఇబ్బంది కర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆజాద్ అన్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ జూన్ నెల వరకూ మాత్రమే తమ వాళ్లు మద్యం వ్యాపారంలో కొనసాగుతారని, ఆపై జరిగే మద్యం వేలంపాటలో పాల్గొన్నవద్దని తన వాళ్లకు స్పష్టంగా చెప్పానని ఆజాద్కు బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చినట్లు సమాచారం. మద్యం వ్యాపారం చేయవద్దని తన కుటుంబసభ్యులకు, సన్నిహితులకు, స్నేహితులకు, ఆప్యాయులకు స్పష్టంగా చెప్పిన విషయాన్ని మీడియా ముఖంగా తాను ప్రకటించానని బొత్స సత్యనారాయణ తెలిపారు.