వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా భార్యను విచారించవద్దు: సిబిఐకి గాలి వినతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బెంగళూరు: అక్రమ మైనింగ్ కేసులో తన భార్య అరుణ లక్ష్మిని విచారించవద్దని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సిబిఐని కోరారు. అరుణ లక్ష్మి అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్న విషయం తెలిసిందే. గత శుక్రవారం నుంచి సిబిఐ అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని విచారిస్తున్నారు.

గాలి జనార్దన్ రెడ్డి, ఆయన పిఎ అలీఖాన్‌లను ఎఎంసి, డెక్కన్ మైనింగ్ సిండికేట్ వ్యాపార లావాదేవీల గురించి సిబిఐ అధికారులు ప్రశ్నించారు. దాఖలాలను వారికి చూపి వాస్తవాలను రాబట్టేందుకు, ధ్రువీకరించుకునేందుకు సిబిఐ అధికారులు ప్రయత్నించారు. వచ్చే సోమవారం గాలి, అలీఖాన్‌లను ఇక్కడ కోర్టులో హాజరు పరచనున్నారు. మరో వారం రోజుల పాటు వారిద్దరిని విచారించేందుకు అనుమతి ఇవ్వాలిని సిబిఐ కోరనుంది.

English summary
Karnataka former minister Gali Janardhan Reddy has appealed CBI not to question his wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X