జగన్ను అరెస్టు చేయాలని టార్గెట్ చేశారు: వైయస్సార్సీ
ఏ తప్పు చేయని మంత్రులే అయితే వారు రాజీనామా చేయాల్సిందేనన్నారు. సిబిఐ అధికారులు మంత్రులను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రాజ్యాంగంపై గౌరవంతో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన న్యాయవాది సుధాకర్ రెడ్డిని ఆయన అభినందించారు. కాగా జగన్ పైన కాంగ్రెసు పార్టీ కుట్ర చేస్తుందని మరో నేత రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి సుపరిపాలన జగన్ వల్లే సాధ్యమన్నారు. మద్యం సిండికేట్ల విషయంలో ప్రభుత్వం మంత్రులను వదిలేసి అధికారులను బలి చేస్తుందని కొండా సురేఖ వరంగల్ జిల్లాలో అన్నారు. కళంకిత మంత్రులను వెంటనే రాజీనామా చేయాలని లేదా ముఖ్యమంత్రి వారిని తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.
సుప్రీం కోర్టు తీర్పు ఆనందంగా ఉందని మరోనేత వాసిరెడ్డి పద్మ హైదరాబాదులో అన్నారు. జగన్ను అరెస్టు చేయాలనే దుర్బద్దితోనే కాంగ్రెసు విచారణ చేయిస్తుందని ఆమె విమర్శించారు. విచారణ నిబంధనల ప్రకారం జరగటం లేదని తాము మొదటి నుండి చేస్తున్న వాదనలకు సుప్రీం కోర్టు తీర్పుతో బలం చేకూరిందన్నారు.