జగన్ కేసు: ఆరుగురు మంత్రులకు సుప్రీం నోటీసులు

Sabitha Indra Reddy - Geeta Reddy
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు రాష్ట్ర ప్రభుత్వం మెడకు చుట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్‌లను విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంత్రులకు, ఐఏఎస్ అధికారులకు సుప్రీం కోర్టు సోమవారం తాఖీదులు జారీ చేసింది. మంత్రులు గీతా రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, పొన్నాల లక్ష్మయ్య, మోపిదేవి వెంకట రమణ, ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, శామ్యూల్, రత్నప్రభ, ఎస్వీ ప్రసాద్, ఆదిత్యనాథ్, మన్మోహన్ సింగ్, సివిఎస్‌కె శర్మ, శ్యాంబాబు తదితర అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని వారిని కోర్టు ఆదేశించింది. మంత్రులను ప్రశ్నించకపోవడంపై వివరణ ఇవ్వాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. జగన్ ఆస్తుల కేసులో జగన్ ఒక్కడినే విచారించడం సరికాదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి అనే న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఆయన పిటిషన్ స్వీకరించి విచారించిన కోర్టు సోమవారం మంత్రులు, ఐఏఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. వివాదాస్పద జివోల్లో ఉన్న మంత్రుల పాత్రపై విచారణ జరపాలని ఆయన సుప్రీంను కోరారు. జివోలతో సంబంధం ఉన్న ఐఏఎస్‌లను సైతం విచారించాలని ఆయన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. జగన్‌కు అనుకూలంగా జివోలు జారీ చేసిన మంత్రులు, అధికారులను విచారించాలని ఆయన కోరారు. సుధాకర్ రెడ్డి అంతకుముందు ఇదే విషయంపై హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో అతను సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+