కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తండ్రిలాగే జగన్ మాటపై నిలబడే నేత: విజయమ్మ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
కడప: తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే తన కుమారుడు వైయస్ జగన్ మాటపై నిలబడే నేత అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శానససభ్యురాలు వైయస్ విజయమ్మ అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపించిన ఏడాది అయిన సందర్భంగా ఆమె శనివారం పులివెందులలోని వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. పార్టీ పతాకను ఆవిష్కరించారు. పేదవాడి కన్నీరు తుడవాలనే జీవితాశయంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి పని చేశారని ఆమె అన్నారు తమ కుటుంబం ప్రజలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆమె చెప్పారు. ప్రజాసంక్షేమం కోసం వైయస్ రాజశేఖర రెడ్డి అహరహం కృషి చేశారని ఆమె అన్నారు.

ఒక్క రూపాయి కూడా పన్నులు పెంచకుండా సంక్షేమ కార్యక్రమాలు అణలు చేసిన ఘనత వైయస్సార్‌కే దక్కుతుందని విజయమ్మ అన్నారు. తన రెక్కల కష్టం మీద కాంగ్రెసును రెండోసారి వైయస్ అధికారంలోకి తెచ్చారని ఆమె అన్నారు. వైయస్సార్ పథకనలు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం చూస్తే బాధేస్తోందని ఆమె అన్నారు. వైయస్ ఆశయాల కోసం పనిచేస్తున్న జగన్‌కు ప్రజలందరి అండదండలు కావాలని కోరారు. పార్టీ పెట్టిన ఏడాదిలోనే వివిధ ప్రజాసమస్యలపై జగన్ రాజీలేని పోరాటం చేశారని ఆమె గుర్తు చేశారు.

English summary
YSR Congress MLA YS Vijayamma said that YS Jagan is committed to his words like his father YS Rajasekhar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X