సోనియాతో దాసరి భేటీ: రాజ్యసభ సీట్లకు పోటాపోటీ
కాగా, తెలంగాణకు చెందిన కేశవరావు కూడా తిరిగి తనను రాజ్యసభకు నామినేట్ చేయాలని కోరుతున్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఆయనకు అండగా నిలుస్తున్నారు. అయితే, తెలంగాణ విషయంలో కాస్తా ధిక్కారణ ధోరణి ప్రదర్శించిన కారణంగా కేశవరావును రాజ్యసభకు తిరిగి నామినేట్ చేసేందుకు అధిష్టానం సిద్ధంగా లేదని అంటున్నారు. కాగా, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి ఏ మాత్రం దాచుకోకుండా తాను రాజ్యసభ టికెట్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుకుంటున్నారు. అయితే, ఈ ముగ్గురి విషయంలోనూ అధిష్టానం ఆలోచణ మరో విధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
దాసరి స్థానంలో చిరంజీవిని రాజ్యసభకు నామినేట్ చేసి ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. ఎఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి కూడా రాజ్యసభ రేసులో ముందు వరుసలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్టం నుంచి జరిగే ఆరు స్థానాల్లో కాంగ్రెసు నాలుగు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. దాంతో పదవీ కాలం ముగుస్తున్నవారిని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.