జగన్, బాబు కుమ్మక్కై మంత్రులను ఇరికించారు: కన్నా

తెలుగుదేశం పార్టీ తమ రాజీనామాలు కోరడంలో అర్థం లేదన్నారు. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు తమ రాజీనామా ఎందుకు అడుగుతున్నారన్నారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. ఈ సందర్భంగా పొన్నాల తన హయాంలో విడుదల చేసిన జివోలను మీడియాకు విడుదల చేశారు. కాగా జగన్ కేసులో సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న మంత్రులు అసెంబ్లీ లాబీల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గీతారెడ్డి, ధర్మాన, కన్నా ముఖ్యమంత్రిని కలిశారు. మరోవైపు మంత్రుల రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేయడంతో స్పీకర్ సభను రెండోసారి అరగంట పాటు వాయిదా వేశారు. స్పీకర్ ఫ్లోర్ లీడర్లను తన చాంబర్కు పిలిపించి మాట్లాడారు.












Click it and Unblock the Notifications