చిరుపై అంబటి నిప్పులు, ఆనం సత్తా తేల్చేందుకే సిఎం..
సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జనక్ ప్రసాద్ బుధవారం మండిపడ్డారు. జెడి లక్ష్మీ నారాయణ ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నారని ఆరోపించారు. జెడి పక్షపాత వైఖరి వీడి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల పక్షపాత ధోరణి వీడాలని అన్నారు. జెడిది మొదటి నుండి ద్వంద్వ వైఖరే అన్నారు. రంగారావును వదిలేసి సునీల్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేశారని ఆయన ప్రశ్నించారు. సిబిఐ ఎఫ్ఐఆర్లో మంత్రుల పేర్లు ఎందుకు చేర్చలేదని అన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తమ్ముడి పేరు కూడా ఎఫ్ఐఆర్ నుండి తొలగించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంటే లక్ష్మీ నారాయణకు ఎందుకు అంత ప్రేమ అన్నారు. జగన్ కేసులో హడావుడి చేసిన జెడి చంద్రబాబు కేసులో కోర్టు నుండి పత్రాలు తీసుకోవడానికి రెండు వారాలు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. జెడి పక్షపాత ధోరణి వీడకపోతే అత్యున్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.