చంద్రబాబుకు తెలంగాణవాదుల ఝలక్, నినాదాలు

దోపిడీ దొంగల మాదిరిగా రాష్ట్రాన్ని దోచుకున్నారని చంద్రబాబు విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ఆయన అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే వరకు తాము పోరాటం చేస్తానని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు.
అంతకు ముందు చంద్రబాబు వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. తాను తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, మాట్లాడబోనని ఆయన అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా బియ్యం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెరాస, కాంగ్రెసు కుమ్మక్కయి తమ పార్టీపై బురద చల్లుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications