'జగన్' తెలివిగా వ్యవహరించారు, మాకు ఇబ్బందే: జెసి

JC Diwakar Reddy
హైదరాబాద్: నోటీసుల వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం తెలివిగా వ్యవహరించిందని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి గురువారం అసెంబ్లీ లాబీల్లో అన్నారు. ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. వైయస్ జగన్ అరెస్టయితే బ్రహ్మాండమైన సానుభూతి ఏమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు దూకుడుగా వ్యవహరిస్తేనే పార్టీ పరిస్థితి భవిష్యత్తులో బాగుంటుందని ఆయన చెప్పారు. జగన్ ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు నోటీసులు పంపించడంతో మంత్రులు ఇరుకున పడ్డట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఫైళ్ల క్లియరెన్సులో మంత్రులు, ముఖ్యమంత్రి జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.

మరోవైపు మంత్రి ధర్మాన ప్రసాద రావు వేరుగా మాట్లాడుతూ... జివోల జారీ వ్యవహారం సమష్టి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ పాలసీల ప్రకారమే తాము జివోలు జారీ చేశామని స్పష్టం చేశారు. జివోలు జారీ చేయాలంటే ఎమ్మార్వో నుండి పై స్థాయి వరకు పద్ధతి ప్రకారం జరుగుతుందని ఆయన చెప్పారు. కాగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవురు ఉప ఎన్నికలపై మంత్రి పితాని సత్యనారాయణ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జగన్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే పార్టీ పెట్టాడని విమర్శించారు. తన అవినీతిలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి కూడా భాగస్వామ్యం ఉందని తెలిపే విధంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారని ఆరోపించారు. జగన్‌కు అజెండా ఏదీ లేదని, అలాంటి వ్యక్తికి వోటు వేయవద్దని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+