ఏం చేశారు?: తెలంగాణపై బిజెపికి రాములమ్మ ఝలక్

కాగా తన నియోజకవర్గంలో రెండు రైల్వే లైన్లు మంజూరు చేసినందుకు కేంద్రానికి విజయశాంతి ధన్యవాదాలు తెలిపారు. ఎంపీల అతివిశ్వాసం వల్లే నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆమె అన్నారు. మెదక్ - అక్కన్నపేట రైల్వే లైన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల ఆమె సంతోషాన్ని వెలిబుచ్చారు. రైల్వే లైన్ మంజూరు కోసం తాను ఎంతగానో కృషి చేశానని అన్నారు. చివరికి తన కల ఫలించిందన్నారు. అలాగే తెల్లాపూర్- పటాన్ చెరువు ఎంఎంటిఎస్ లైన్కూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆమె తెలిపారు. అయితే కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు.












Click it and Unblock the Notifications