చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి విజిటింగ్ ప్రొఫెసర్‌: జగన్ పార్టీ నేత భూమన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bhumana Karunakar Reddy
చిత్తూరు: తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, మాజీ టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం మండిపడ్డారు. తిరుపతి నగర సమస్యలపై కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్సీ నగర పాలక సంస్థ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. చిరంజీవి తిరుపతి సమస్యలపై పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికై రెండేళ్లు దాటినా ఆయన నియోజకవర్గానికి వచ్చి సమస్యలు తెలుసుకున్న సందర్భాలు తక్కువ అన్నారు. ఆయన అలా వచ్చి ఇలా వెళుతుంటారని విమర్శించారు. తిరుపతికి చిరంజీవి విజిటింగ్ ప్రొఫెసర్‌గా మారారని విమర్శించారు.

ఇప్పటి వరకు చిరంజీవికి నగర సమస్యల పట్ల అవగాహన లేదన్నారు. ప్రజల సమస్యలు తొలగించాలనే తపన, చిత్తశుద్ధి లేని వ్యక్తి అని విమర్శించారు. ఆయన వైఖరి వల్ల ఇక్కడి అధికారులు కూడా నిస్తేజంగా మారి సమస్యలను గాలికి వదిలేశారని అన్నారు. కాగా నగర కమిషనర్‌కు కరుణాకర్ రెడ్డి సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం ఇచ్చారు.

English summary
YSR Congress Party leader Bhumana Karunakar Reddy accused that Chiranjeevi is visiting Tirupati as professor but not like MLA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X