వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యయత్నం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nalgonda District
నల్గొండ: జిల్లాలోని తుంగతుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒక విద్యార్థిని సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేయగా, మరో విద్యార్థిని మంగళవారం ఉదయం చేసింది. ప్రభ అనే విద్యార్థిని రసాయన మిశ్రమాన్ని మింగి ఉదయం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో సిబ్బంది వారిని దగ్గరలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

అయితే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ వేధింపులను తట్టుకోలేకనే ఆ విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సమాచారం. వరుసగా ఇద్దరు ఆత్మహత్యయత్నం చేయడంతో పాఠశాలలో గందరగోళ పరిస్థితి నెలకొంది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
Two girl students tried to suicide in Nalgonda district gurukul school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X