యుపిలో జీపును ఢీకొన్న రైలు, 15 మంది మృతి

ఈ సంఘటన ఉదయం ఏడున్నర గంటల సమయంలో మదు రైల్వే స్టేషన్కు సమీపంలో జరిగింది. ప్రమాదానికి గురైన జీపులో మొత్తం పదిహేడు మంది ప్రయాణిస్తున్నట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. రైలు వస్తుండగా జీపు డ్రైవర్ ట్రాక్ దాటేందుకు ప్రయత్నాలు చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. కాగా ముకుల్ రాయ్ రైల్వే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. దేశంలో సుమారు 15వేల కాపలా లేని రైల్వే క్రాసింగులు ఉన్నాయని అంచనా. వాటి పైన మంత్రి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.












Click it and Unblock the Notifications