ఉప ఫలితాలపై సోనియా ఆగ్రహం: కావూరి వివరణ

తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకులు ప్రస్తుత ఫలితాల నేపథ్యంలో మరోసారి తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపించేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణపై పార్టీ వైఖరిని తప్పు పడుతున్నారు. తెలంగాణ ప్రజలు తమను నమ్మలేదని, తెలంగాణ ఇస్తేనే ప్రజలు నమ్ముతారని రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెసు నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సీనియర్ కాంగ్రెసు నాయకుడు కె. కేశవరావు కూడా తీవ్రంగా స్పందించారు.
కాగా, మహబూబ్ నగర్ విజయంతో బిజెపిలో కొత్త ఉత్సాహం నిండుకున్నట్లు అర్థమవుతోంది. బిజెపి జాతీయ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు ఈ ఫలితంపై స్పందించారు. రాష్ట్ర రాజకీయాల్లో మహబూబ్ నగర్ ఫలితం నూతన అధ్యాయానికి నాంది అవుతుందని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా తాము తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఆదరించినట్లు ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. బిజెపితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ప్రజలు నమ్ముతున్నారని ఆయన అన్నారు. మతవాదం తమ పార్టీ అభ్యర్థిని గెలిపించిందనే వాదనను ఆయన తోసిపుచ్చారు. తెలంగాణవాదమే తమను గెలిపించిందని ఆయన చెప్పారు. తమ పార్టీ విజయం తెలంగాణపై ప్రజల ప్రబల ఆకాంక్షకు నిదర్శనమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications