జగన్తో పార్టీ శ్రేణులు వెళ్లాయి, ఇక్కడెవరూ లేరు: డిఎల్
ఉప ఎన్నికల ఫలితాలపై మేడం సోనియా గాంధీ అసంతృప్తితో ఉన్నారని ఆయన చెప్పారు. వచ్చే ఫలితాలు కూడా ఇలాగే ఉంటే అసమ్మతి పెరగడం ఖాయమని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ఓటమితో యువ శానససభ్యులు అయోమయంలో పడ్డారని ఆయన అన్నారు. ఇప్పటి వరకు తాను ఎవరి మీద కూడా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు. తాను సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోరానని, అపాయింట్మెంట్ ఇవ్వగానే వెళ్లి కలుస్తానని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పటి నుంచి సంభవించిన పరిణమాలను సోనియాకు రాసి లేఖలో పొందుపరిచానని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాలను ముఖ్యమంత్రి క్రికెట్తో పోల్చడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
Comments
dl ravindra reddy congress sonia gandhi hyderabad డిఎల్ రవీంద్రా రెడ్డి కాంగ్రెసు సోనియా గాంధీ హైదరాబాద్
English summary
Minister DL Ravindra Reddy said that Congress cadre followed YSR Congress president YS Jagan.
Story first published: Thursday, March 22, 2012, 13:15 [IST]