నల్లపురెడ్డి ప్రసన్న గెలిచారు, అనుచరులు ఓడారు?

అయితే ఓటింగ్ లెక్కింపు రోజున తొలుత రౌండ్ రౌండ్కు నల్లపురెడ్డి మెజార్టీ పెరుగుతుండటంతో పార్టీ వారు ముప్పై వేలు, యాభై వేలు, ఇరవై ఐదు వేలు వస్తుందంటూ పందేలు కట్టారట. కానీ చివరి రౌండ్లలో ఆధిక్యత వచ్చినప్పటికీ అది తగ్గడంతో మెజార్టీ కేవలం 23వేలకు పైగా వచ్చింది. దీంతో నల్లపురెడ్డి మెజార్టీపై పందేలు కట్టిన కార్యకర్తలు భారీగా నష్టాలను చవి చూశారట. టిడిపి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్ పార్టీ వారే మెజార్టీపై పందేలు కట్టి కోట్లు నష్టపోయారని వార్తలు వస్తున్నాయని చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications