కాంగ్రెసులోకి వస్తేనే జగన్‌కు భవిష్యత్తు: శంకరరావు

Shankar Rao
హైదరాబాద్: ఉప ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై మరోసారి దాడి చేస్తూ మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసబ్యుడు పి. శంకరరావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు ఓ సలహాను పారేశారు. కాంగ్రెసులోకి వస్తే వైయస్ జగన్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుల్లో కాంగ్రెసు రక్తమే ప్రవహిస్తోందని ఆయన అన్నారు.

ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలకు ఉప ఎన్నికలు రాకముందే అది జరగాలని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి - ఇలా ముఖ్యమంత్రులు మారుతూ 1983 పరిస్థితిని తీసుకుని రావద్దని ఆయన అన్నారు. 2014లో కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. దేశ భవిష్యత్తు రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీయేనని ఆయన అన్నారు. లోకసభకు రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు వచ్చి, శాసనసభకు తక్కువ స్థానాలు వచ్చే పరిస్థితి ఉందని, 2009 ఎన్నికల్లో ఇదే జరిగిందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+